50 లక్షల రుణం అందిస్తున్న మోడి
– స్వయం ఉపాధికి ఆసరాగా ముద్ర యోజన
– దరఖాస్తు చేసుకోండి ఇలా
దర్శిని బ్యూరో : దేశంలో స్వయం ఉపాధిని వృద్ది చేసేందుకు భారత ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎందరికో ఆసరాగా నిలిచింది. మొదటి దశలో ఎంతో మందికి అండగా నిలిచిన ఈ పథకం ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. రెండో విడతలో పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు ముద్ర పథకం ప్రారంభమైంది. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం. ఈ స్కీమ్ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. ఇందుకు కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్ర వెబ్సైట్కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది.
