వీరశైవ సమాజ అభివృద్ధే ధ్యేయం
– వీరశైవ యువదశ్ కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా అడికి శశాంక్
– రెండేళ్ల పాటు కార్యవర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ యువదళ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా అదేరోజు రాత్రి పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో నూతన కమిటిని ప్రకటించారు. వీరశైవ యువదళ్ అధ్యక్షులుగా ఆడికి శషాంక్, గౌరవాధ్యక్షులుగా మఠం జదీశ్వర్, ఉపాధ్యక్షులుగా రాయల్ రవికుమార్, శివప్రసాద్, గాండ్ల పరమేష్, ప్రధాన కార్యదర్శిగా మద్రిక చంద్రకాంత్, సంయుక్త కార్యదర్శులుగా హేరూర్ పాణికుమార్, అన్నారం దినేష్, మడపతి నాగేంద్రప్ప, కోశాధికారి కిరణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు వినోద్ కుమార్, సిద్దు అయ్య, మీదిపేట వీనోద్, ప్రశాంత్, శివకుమార్, వీరేశం, అనిల్ కుమార్, జోళ్లు నవీన్, బస్వరాజ్ మిర్యాణం, గాజుల శివకుమార్, మల్లికార్జున్, శ్రవణ్ కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.
రెండేళ్ల పాటు కార్యవర్గం కొనసాగనుంది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సమాజం అభ్యున్నతికి తోడ్పడుతామని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని వీరశైవ సమాజం, యువదళ్ సభ్యులు అభినందించి.. సన్మానించారు.
ఇదికూడా చదవండి….

