నమోస్తుతే.. రేణుకా ఎల్లమ్మ..!
– ఐదు చీరలతో ప్రత్యేక అలంకరణ
– నెహ్రుగంజ్లో శ్రావణ శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నమోస్తుతే అంటూ భక్తులు తాండూరు పట్టణం నెహ్రుగంజ్లో వెలసిన అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దేవాలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి సమర్పించిన ఐదు చీరలతో అలంకరణ చేశారు. పంచవర్ణ చీరలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేదివ్యమానంగా కొలువు దీరిన అమ్మవారిని భక్తులు ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి సల్లంగా చూడూ తల్లీ అంటూ వేడుకున్నారు. భక్తుల దర్శనాలతో ఆలయంలో శ్రావణ శుక్రవరం సందడిగా మారింది.
ఇదికూడా చదవండి…

