రిపోర్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

రిపోర్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కుమార్‌ను మనోదైర్యం చెప్పిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన మహన్యూస్ రిపోర్టర్ కుమార్‌ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. గత రెండు రోజుల క్రితం కుమార్ తల్లి తోక ఆశమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ఎమ్మెల్యే తాండూరు పట్టణంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కుమార్‌ను పరామర్శించి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, జర్నలిస్టులు డి.రామకృష్ణ, శివానంద్ సింగ్, నేతలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ