నిదానంగా నిమజ్జనం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిదానంగా నిమజ్జనం..!
– ఆలస్యంగా వినాయకుల వీడ్కోలు
– మధ్యాహ్నం వరకు కొనసాగిన వైనం
– వాగు వద్ద భారిగా ఉండిపోయిన విగ్రహాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐదు రోజులు పూజలందుకున్న వినాయకుల నిమజ్జనం తాండూరులో నిదానంగా కొనసాగింది. బుధవారం మొదలైన వినాయకుల నిమజ్జన ఉత్సవాలు గురువారం మధ్యాహ్నం అయినా ముగిసిపోలేదు. తాండూరు పట్టణంలో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జనం వేడుకులను యాలాల మండలం కోకట్ వాగులో నిర్వహించారు. ప్రతి యేడాది సాయంత్రం బయల్దేరే వినాయకులను తెల్లవారు జాము వరకు నిమజ్జన ఉత్సవాలున ముగించేవారు.

ఈసారి కూడా అదేవిధంగా బుధవారం సాయంత్రం నుంచి పట్టణ వినాయకులు నిమజ్జనానికి బయల్దేరాయి. కాని గురువారం ఉదయం వరకు వినాయకుల ఊరేగింపు ఇంకా పట్టణంలోనే కొనసాగింది. మరోవైపు వాగు వద్దకు ఒక్కో వినాయకుడు ఆలస్యంగా బయల్దేరాయి. గురువారం తెల్లవారు జాము వరకు వినాయకులు నిమజ్జనానికి వెళ్లలేదు. అన్ని వినాయకులను ఒక్కసారిగా తరలించడంతో వాగు వద్ద వినాయకల విగ్రహాలు రోడ్డు మీద, వాగు గట్టుమీద ఉండిపోయాయి.

నిమజ్జనం కోసం వచ్చిన సభ్యులు వినాయకుల విగ్రహాల వద్దే పడుకుండిపోయారు. వాగు వద్ద వినాయకుల విగ్రహాలు జాతరను తలపించాయి. ఒక్కో విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో కార్యక్రమం మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి..

లడ్డూ వేలం రికార్డు బ్రేక్..!