అందరికి సకల శుభాలు కలగాలి..!
– సంతోషంగా ఉగాది పచ్చడి వితరణ
– ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికి శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీవిశ్వవసు నామ సంవత్సరంను పురస్కరించుకుని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళీకాదేవి దేవాలయం వద్ద ప్రజలకు పచ్చడి వితరణ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది కొత్త సంవత్సరం ప్రజలందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టైలర్ రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణు, అంబ్రేష్, శివ ఖాంజాపూర్, పంజుగుల శ్రీనివాస్, జగదీష్ బాస్పల్లి, గోపాల్, రమేష్, అనిల్, భరత్, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

