తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాటి కార్యవర్గం ఎన్నిక
– రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిలాని, తాండూరు అధ్యక్షులుగా సమీయోద్దీన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ పోరాట హక్కుల సమితి కార్యవర్గం శుక్రవారం ఏర్పాటయ్యింది. రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కార్యాలయంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా న్యాయవాది జిలాని, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా సమీయోద్దీన్, ప్రధాన కార్యదర్శిగా అబ్రార్ లాల, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ రఫీక్, పట్టణ అధ్యక్షులుగా మహమ్మద్ సాధిక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ షఫీ, ప్రధాన కార్యదర్శిగా హఫీజ్, మహమ్మద్ యూసుఫ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వాహబ్ మాట్లాడుతూ మైనార్టీల హక్కుల సాధన కోసం కార్యవర్గ సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి….

