శాంతినగర్ లో ఘనంగా బతుకమ్మ
– మాజీ జెడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.

పెద్దేముల్ జెడ్పిటీసి మాజీ సభ్యురాలు ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో మహిళలు భారీగా హాజరై బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతున్నారు. నవరాత్రుల సందర్బంగా మహిళలు తొమ్మిదిరకాల మట్టిగాజులు వేసుకొని గౌరమ్మను పూజించారు. ఇలా 8 రోజుల పాటు వైవిధ్యంగా బతుకమ్మలను పేర్చి సంబరాలను చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి బతుకమ్మలను బస్సులో కాగ్నా నదికి తీసుకెళ్లి నిమర్జనం చేశారు. ఈరోజు కార్యక్రమంలో కాలానీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

