రేపు పవర్ కట్..!
– ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరు మండలంలో పవర్ కట్ విధిస్తున్నట్లు తాండూరు విద్యుత్ డీఈ భాను ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

తాండూరు మండలంలోని జినుగుర్తి, కోటబాస్పల్లి 33 కేవి సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారు.

తాండూరు మండలంలోని కరణ్ కోట్ 33కేవి ఫీడర్పై అల్లాపూర్ నుంచి మల్కాపూర్ వరకు నేషనల్ హైవే స్థంబాలు షిప్టింగ్, లైన్ మేయింటెనెన్స్ పనులు జరుగున్న కారణంగా పవర్ కట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున విద్యుత్ అంతరాయినికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


