తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఓ షాపు తొలగింపు యత్నం ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని హెచ్బీ కాంప్లెక్స్ వద్ద గత కొన్ని రోజుల క్రితం శ్రీకృష్ణ చిప్స్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు.
బుధవారం మున్సిపల్ సిబ్బంది జేసీబీ తీసుకవచ్చి కూల్చేప్రయత్నం చేశారు. అనుమతులు లేకుండా షాపు నిర్మించారని యజమానితో వాగ్వివాదం జరిగింది. కొంత సమయం ఇవ్వాలని అంగీకారం జరగడంతో కూల్చివేత ప్రయత్నాన్ని మానుకున్నారు.

