అనాథల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
– మంత్రులకు వినతిపత్రాలను అందజేసిన పంజుగుల శ్రీశైల్ రెడ్డి
దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అనాథల రక్షణ కోసం తీసుకవస్తున్న ప్రత్యేక రక్షణ చట్టాన్ని పటిష్టింగా అమలు చేసేలా చూడాలని టీఆర్ఎస్ నాయకులు పంజులు శ్రీశైల్ రెడ్డి రాష్ట్ర మంత్రులను కోరారు. సీఎం కేసీఆర్ గారు అనాథల కోసం ప్రత్యేక చట్టం తేవడంలో భాగంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు పంపే బృందంలో శ్రీశైల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన అనాథల రక్షణ చట్టం ప్రతిపాదనల బృందంతో కలిసి రాష్ట్ర మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారిని కలిసి చట్టంలో ఉండాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా చూడాలని కోరారు. ఇందుకు మంత్రులు స్పందిస్తూ అనాథల రక్షణ చట్టం పట్ల సీఎం సీరియస్గా ఉన్నారని, ప్రతిపాదనలు తప్పక పరిగణలోకి తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారని శ్రీశైల్ రెడ్డి పంజుగుల తెలిపారు.

