మృతునికి కుటుంబానికి బీఎస్ఆర్ చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్


మృతునికి కుటుంబానికి బీఎస్ఆర్ చేయూత

– అనుచరుల ద్వారా ఆర్థిక సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న కుటుంబాలకు తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా యాలాల మండలం సంగెంకుర్దు గ్రామానికి చెందిన ఎ.బలప్ప ఇటీవలే మరణించారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. బీఎస్ఆర్ టీం సభ్యుల ద్వారా కుటుంబానికి రూ. 6వేల నగదును అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మరణించిన బాలప్ప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు టీం సభ్యులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..!