టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్…!
– పై చదువు స్కాలర్షిఫ్ దరఖాస్తులకు అవకాశం
– హివిజన్ ఫౌండేషన్ ద్వారా స్వీకరణ
– అర్హతలు, గడువు ఎలా ఉన్నాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హివిజన్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. టెన్త్ తరువాత పై చదువులు చదువుకునేందుకు స్కాలర్ షిఫ్లు అందించబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ. 25000లతో పాటు విధంగా విద్యార్థి క్రింది తరగతిలో 80% మార్కులు, 10వ తరగతిలో కూడా 80% మార్కులు వచ్చిన వారే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తిగల వారు ఈనెల 17వ తేదిలోపు ఆన్లైన్లో దరఖాస్తులు, ఈ వరకూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు రమేష్(9397392248), సుజాత(8106767108), కృష్ణ(7207996843)లను సంప్రదించాలన్నారు.

ఇదికూడా చదవండి…

