శ్రీరామ మందిరానికి చేయూత..!
– ఫ్లోరింగ్ నిర్మాణానికి ఆర్థిక సాయం
– ప్రతిష్టాపనలో అన్నదానంకు ముందుకు
– ధన్యవాదాలు తెలిపిన దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీరామమందిర పునర్ నిర్మాణానికి భక్తులు చేయూత అందిస్తున్నరు. తాజాగా పట్టణంకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి. అశోక్ పునర్నిర్మాణానికి సహకారం అందించారు.

దేవాలయంలో నిర్మించే ఫ్లోరింగ్ కోసం రూ. 51వేల విరాళం అందజేశారు. అదేవిధంగా దేవాలయంలో పునర్ నిర్మాణంలో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అన్నదానం నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. దీంతో పాటు ఉత్సవాలలో విద్యుత్ బెల్ సౌండ్ సిస్టం అందిస్తానని తెలిపారు. ఇందుకు దేవాలయ కమిటి సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులు ఇంకా ఎవరైనా శ్రీరామమందిర పునర్ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

