ప్రశాంతంగా పార్లమెంట్ పోలింగ్
– ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు
– పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు
– పోలీసుల బందోబస్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సందడి కనిపించింది. పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ఓటర్ల కోసం అధికారులు అన్ని ఏర్పట్లను చేశారు. ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా అధికారులు పోలింగ్ కేంద్రాలపై దృష్ఠి సారించారు. ఉదయం నుంచి 9 గంటల వరకు 11శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదికూడా చదవండి….

