బస్సు సర్వీసులు బంద్
– పలు రూట్లలో తాత్కాళికంగా నిలివేత
– వెల్లడించిన డీఎం సురేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో నుంచి వివిధ రూట్లలో బస్సు సర్వీసులు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రవాణా సేవలను తాత్కాళికంగా నిలిపివేసినట్లు డీఎం సురేష్ కుమార్ వెల్లడించారు. తాండూరు – మహాబూబ్ నగర్ మార్గంలో రోడ్లు తెగిపోవడంతో తాండూరు – శ్రీశైలం, తాండూరు – మహబూబ్ నగర్, తాండూరు – సేడం, మార్గాలలో బస్సులను రద్దు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ మార్గంలో బస్సులు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. అదేవిధగంగా చించొల్లి, జహీరాబాద్, సంగారెడ్డి మార్గాలలో బస్సులు నడుస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

