సల్లంగా చూడూ శ్రీశైలం మల్లన్నా..!
– స్వామి వారిని దర్శించుకున్న పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడు మల్లన్నా స్వామి అంటూ శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామిని తాండూరు బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు వేడుకున్నారు. శుక్రవారం శ్రీశైలం వెళ్లిన ఆయన తెల్లవారు జామున బ్రమరాంబ మల్లికార్జున స్వామిని మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, సామాజిక సేవకులు మరాఠీ నర్సింలుతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ దర్శనం చేసుకున్న నర్సింలుకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రజలందరిని సల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి…

