
దేవాలయ అభివృద్ధికి కృషి చేయండి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన స్టేషన్ హానుమాన్ దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. బుధవారం తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయానికి నూతక కమిటి సభ్యులుగా ఎన్నికైన శంకర్ రావు, వెంకటేశం, నారాయణ, శ్రీధర్, నరహరిలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పాలకవర్గ సభ్యులుగా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

