గ్రేట్ రిజల్ట్స్‌కు కేరాఫ్ శ్రీ నేతాజీ గురుకుల్ స్కూల్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రేట్ రిజల్ట్స్‌కు కేరాఫ్ శ్రీ నేతాజీ గురుకుల్ స్కూల్
– స్కూల్ టాపర్లుగా 9 మంది విద్యార్థులు
– 7 మందికి 10 జీపీఏ ర్యాంకులు
– విద్యార్థులను అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతితో గ్రేట్ రిజల్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల నిలుస్తోందని నిరూపించుకుంది. ఈ సారి విడుదలైన పదో తరగతి ఫలితాలలో పాఠశాల విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు స్కూల్ టాపర్లుగా నిలిచారు. మరో 7 మంది 10జీపీఏ ర్యాంకులు సాధించారు.

స్కూల్‌ టాపర్లు వీళ్లే…
ఏనుగు తనుష్ రెడ్డి – 579/600
డూబాస్ రాహుల్ – 577/600
టీ.శ్రద్ధా – 576/600, టోపోజీ హర్షిత – 573/600
దేవాడిగా భువన – 572/600
కల్వ మనోజ్ఞ- 571/600
దరిమీది సోహానా – 568/600
వీ. జేత్ర గుప్త – 567/600
పబ్బే కార్తిక్ -562/600

7 మందికి 10జీపీఏ పాయింట్లు
పాఠశాలకు చెందిన 7 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించడంతో పాటు 6 మంది 570పైగా, 9 మంది 560కి పైగా, 12 మంది 550కి పైగా, 18 మంది 540కి పైగా, 41 మంది 500కి పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలలు స్పందిస్తూ గ్రేట్ రిజల్ట్స్ కు శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల కేరాఫ్ గా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ఇలాంటి ఫలితాలను తిరగరాసే విధంగా కృషి చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి….

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..?