ఈ నెల 23న స్కూల్స్, కాలేజీలు బంద్..!
– వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
– సంఘాల డిమాండ్లు ఏమంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈనెల 23న తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల బందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ చేపట్టనున్నారు. దీంతో ఈ నెల 23న పాఠశాలలు, జూనియర్ కాలేజీలు బంద్ చేయనున్నట్లు ప్రకటించాయి.
డిమాండ్లు ఇవే..
ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.
విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి.
ఖాళీగా ఉన్న టీచర్,MEO,DEO పోస్టులను భర్తీ చెయ్యాలి.
ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి.

పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి.
అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలి.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి.
విద్యార్థులకు RTC లో ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి.
NEP 2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి.

ఇదికూడా చదవండి…

