పంచవస్త్ర దారిణిగా రేణుకా ఎల్లమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్


పంచవస్త్ర దారిణిగా రేణుకా ఎల్లమ్మ
– ఐదు చీరలతో అమ్మవారకి ప్రత్యేక అలంకరణ
– దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లోని రేణుకా నాగ ఎల్లమ్మ తల్లి పంచవస్త్ర దారిణీగా దర్శనమిచ్చారు. శ్రావణం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయ పూజారి అమ్రేష్‌ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయంలో వెలసిన అమ్మవారికి ఐదు రకాల చీరలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి అర్చన, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అమ్రేష్‌ పంతులు మాట్లాడుతూ శ్రావణం సందర్భంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి….

చదువుకోసం కష్టాలు..!