కాసేపట్లో పేర్కంపల్లికి కవితక్క..!
– అక్కా చెల్లెళ్ల కుటుంబానికి పరామర్శ
– హైదరాబాద్ నుంచి బయల్దేరిన జాగృతి అధ్యక్షురాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని పేర్కంపల్లి గ్రామానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వస్తున్నారు.

మూడు రోజుల క్రితం చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్పును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. ఇందులో యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూషా, సాయిప్రియ, నందినిలు కూడా ఉన్నారు. వారి దుర్మరణం రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే.

బాధిత కుటుంబానికి నేతల పరామర్శ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కంపల్లి గ్రామానికి వస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయల్దేరినట్లు తెలిసింది. మరి కాసేపట్లో కవిత పేర్కంపల్లి గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇదికూడా చదవండి…

