రేపు ధర్మశాస్త అయ్యప్ప స్వామి మహా పడిపూజ
– స్వాములకు, భక్తులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

పట్టణంలోని గురు మణికంఠ ఆశ్రమం కన్య స్వామి ఎల్.హరీష్ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు అయ్యప్పస్వామి మహా పడి పూజలను నిర్వహించనున్నారు. హేరూర్ వార్డు కన్య పాఠశాల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి అభిషేకాలు, పల్లకి సేవ, పద్దెనిమిది మెట్ల పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అనంతరం భక్తులకు అల్పాహార వితరణ ఉంటుందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని భక్తులను పూజల్లో పాల్గొనాలని బాల హనుమాన్ భజన కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

