విషమంగా పటేల్ ప్రవీణ్ ఆరోగ్యం
– హైదరాబాద్ నిమ్స్ వెంటిలేటర్పై చికిత్స
– పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటేల్ ప్రవీణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదేరోజు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో పటేల్ ప్రవీణ్ చికిత్స పొందుతున్నారు.

శనివారం పటేల్ ప్రవీణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిసింది. అంతకుముందే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రవీణ్ కుమార్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. మరోవైపు పటేల్ ప్రవీణ్ ఆరోగ్యం విషమించడం పట్ల తాండూరుకు చెందిన పలువురు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదికూడా చదవండి…

