క‌న్నుమూసిన సిరివెన్నెల

తెలంగాణ సినిమా హైదరాబాద్

క‌న్నుమూసిన సిరివెన్నెల
– తెలుగు చిత్రసీమ‌లో మ‌రో విషాదం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం క‌న్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మంలో తీవ్ర విషాదం నెల‌కొంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా సినీ పరిశ్రమలో 3000లకు పైగా పాటలు రాశారు.. పదకొండు నంది అవార్డ్స్.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.