రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఏడీఈ శంకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

తాండూరు మండలం గౌతాపూర్ 33/11కేవీ సబ్స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కారణంగా గౌతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.


