జావిద్ భాయ్ దూకుడు..!
– ప్రజా సమస్యలపై ఫోకస్
– కాలనీలో అండర్ డ్రైనేజీలకు మరమ్మత్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ దూకుడును కొనసాగిస్తున్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేపట్టక ముందునుంచే వార్డులోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీలలో ప్రజా సమస్యలపై దృష్టిసారించారు. కాలనీలో విద్యుత్ దీపాలకు సోంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించారు.

పారిశుద్ధ్యంలో భాగంగా మురుగు కాలువల పరిశుభ్రతను నిర్వహించేలా కృషి చేశారు. తాజాగా శుక్రవారం కాలనీలో అండర్ డ్రైనేజీలకు మరమ్మత్తులు చేయించారు. ఏండ్లుగా నిర్వహణ లేక ఏర్పడిన పూడికలను దగ్గరుండి తీయించారు. ఇది కూడా ప్రవేటు వ్యక్తులను తీసుకవచ్చి పూడికలను తీయించారు. కాలనీలో సమస్యలు పరిష్కరిస్తున్న జావిద్ భాయ్ను పలువురు అభినందిస్తున్నారు.


