మెరుగైన సేవలను అందించండి..!
– ఆర్డీఓను కలిసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కర్ర అనితను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన కర్ర అనితను శుక్రవారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్చగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనితతో శ్రీనివాస్ రెడ్డి తాండూరు డివిజన్ గురించి చర్చించారు. డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలను అందించాలని కోరారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలు, అసాంఘీక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.


