ఆపరేషన్.. నక్సల్స్..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ఆపరేషన్.. నక్సల్స్..!
– నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– మహరాష్ట్ర పోలీసులకు అప్పగింత
– తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తప్పించుకుని తిరుగుతున్న నక్సల్స్‌ కోసం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.

వికారాబాద్‌ జిల్లా తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్ర చత్తీస్గడ్ చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక లేడీ నక్సలైట్‌పై అక్కడ కేసు నడుస్తోంది.

అయితే ఈ నలుగురు నక్సలైట్స్‌ తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి రుక్మాపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఇటీవల కూలీ పనులకు కుదిరారు. గత 10 రోజులుగా వారు ఇక్కడే పనులు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు, తాండూరు పోలీసుల సహాయంతో అపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్‌లో దాడులు నిర్వహించారు. నలుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు.

మహారాణా ప్రతాప్‌ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి