కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రాధాన్యం
– సమయానుకూలంగా నేతలకు సముచిత స్థానం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఏకగ్రీవంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏక్రగీవంగా జరిగింది. సభ్యులుగా మేన్గారి సుభాష్‌(15వ వార్డు), మహమ్మద్ రహీం (10వ వార్డు), చినోళ్ల సరిత హరి గౌడ్ (13వ వార్డు), ఆప్రిన్ జవేరియా అన్వర్ అమ్మద్ ఖాన్ (17వ వార్డు)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మాంచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసే మిగతా వారికి సమయానుకూలంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి