ముచ్చింతల్ను మురిపించిన వాసవి మహిళ మండలి
– దాండియా ఆడిపాడిన మండలి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముచ్చింతల్ శ్రీ రామానుజాచార్యుల దివ్యక్షేత్రంలో తాండూరు వాసవి మహిళ మండలి సభ్యులు మురిపించారు. గత పదిరోజులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్లో సహాస్రాబ్ది ఉత్సవాలలో మండలి సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ సమారోహ ఉత్సవాలలో తాండూరు వాసవి మహిళ మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామాజునచార్యుల విశిష్టతను తెలుపుతూ ఇచ్చే కళాప్రదర్శనలో పాల్పంచుకున్నారు. ఇందులో భాగంగా దాండియా అడి భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. దాండియా ప్రదర్శనలో భక్తులను ఆహ్లాద పరిచి మమైరిపించారు.
https://youtu.be/enVk27ay-qk

