వినాయకున్ని దర్శించుకున్న కౌన్సిలర్ ప్రవీణ్గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణనాథున్ని తాండూరు మున్సిపల్ 33వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్గౌడ్ దర్శించుకున్నారు. శుక్రవారం పట్టణంలోని బసవణ్ణకట్ట వద్ద మండపాన్ని సందర్శించి గణేషున్ని దర్శించుకున్నారు. భక్తిశ్రద్దలతో వినాయకున్ని దర్శించుకుని పట్టణ వాసులను సల్లంగా చూడాలని వేడుకున్నారు.

