తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు..!

జాతీయం తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు..!
– ఆరు స్థానాల్లో నలుగు సిట్టింగ్‌లకు అవకాశం
– ఏయే స్థానాల్లో ఎవరున్నారో ప్రకటించిన అధిష్టానం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 6 స్థానాలకు సంబందించి అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇందులో నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్‌-కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌-బండి సంజయ్‌, నిజామాబాద్‌-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఖమ్మం-డాక్టర్‌ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లో‌క్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!