వినాయకున్ని దర్శించుకున్న బీఎస్ఆర్
– గౌతాపూర్ ప్రత్యేక పూజలు చేసిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్లో ప్రతిష్టించిన వినాయకులను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) దర్శించుకున్నారు. ఆదివారం రెండో రోజు గ్రామంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపాలను శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జె.నాగప్ప, కాంగ్రెస్ నాయకులు రాంచెందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మల్రెడ్డి, హరీష్ రెడ్డి, జగన్ రెడ్డి, నర్సిరెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు అజ్మత్ అలీ, విజయ భాస్కర్ రెడ్డి, పలువురు నేతలు, యువకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

