మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
– మానవత్వం చాటుకున్న ఏజాజ్
– ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ యువనాయకులు ఎండీ ఏజాజ్ మానవత్వం చాటుకున్నారు. వార్డుకు చెందిన స్వర్ణలత అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుమారుడుతో కలిసి జీవించేది. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ యువనాయకులు ఏజాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి అంత్యక్రియల కోసం రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు. ఏజాజ్ అందించిన సాయంకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

