టీచర్ల అభ్యున్నతికి ఎమ్మెల్సీ పింగలి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

టీచర్ల అభ్యున్నతికి ఎమ్మెల్సీ పింగలి కృషి
– శ్రీపాల్‌ రెడ్డితో ఉపాధ్యాయుల సంక్షేమం
– యాలాల మండల పీఆర్టీయూ అధ్యక్షులు కృష్ణారెడ్డి
– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయుల అభ్యన్నతికి ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల అధ్యక్షులు సి.కృష్ణారెడ్డి అభివర్ణించారు.

మంగళవాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా కృష్ణారెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల క్షేమం కోసం పింగిలి శ్రీపాల్ రెడ్డి కృషి చేస్తూ అందరి ఆశాజ్యోతిగా నిలుస్తున్నారని అన్నారు. అదేవిధంగా విద్యాభివృద్ధి, ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయంగా, ఉపాధ్యాయ సమస్యల సాధనకై నిరంతరం పరితపించే అలుపెరుగని పోరాట యోధుడు అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి సంతోషంగా జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్