అయూబ్ ఖాన్కు చీఫ్ విప్ పరామర్శ
– ఇంటికి వెళ్లి ఓదార్పు ఇచ్చిన మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన అయూబ్ ఖాన్న్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పరామర్శించారు.

అయూబ్ ఖాన్ మాతృమూర్తి స్వర్గస్తులైన విషయం తెలియగానే ఆదివారం ఉదయం మహేందర్ రెడ్డి పాత తాండూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చీఫ్ విఫ్తో పాటు రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, నయీమ్ ఖాన్, బిర్కెట్ రఘు తదితరులు ఉన్నారు.



