రాములోరి సేవలో చిరు వ్యాపారి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాములోరి సేవలో చిరు వ్యాపారి..!
– మండపం నిర్మాణంకు ఆర్థిక సాయం
– అభినందించిన దేవాలయ కమిటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీరామమందిర పునర్‌ నిర్మాణంలో భాగంగా మండపంకు భక్తులు చేయూత అందిస్తున్నారు.

ఇటీవలే రామ మందిర మండప పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.

తాజాగా పట్టణంకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి. అశోక్ సహకారం అందించారు. దేవాలయంలో నిర్మించే మండపం కోసం రూ. 50వేల రూపాయలు విరాళం అందజేశారు. ఇందుకు దేవాలయ కమిటి సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

భక్తులు ఇంకా ఎవరైనా శ్రీరామమందిర పునర్‌ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు.

అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం..!