వ్యక్తి అదృశ్యం..!
– ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
– తాండూరు పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి అదృశ్యమయ్యారు.

ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నరసింహారెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫొటోను విడుదల చేసి, ఎవరైనా గుర్తించినా, ఆచూకీ తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం తెలిసిన వారు సెల్: 8688113096 నంబర్కు ఫోన్ చేయగలరని విజ్ఞప్తి చేశారు.


