21న హిందూఉత్సవ సమితి సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 21న తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమితి అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. 21న ఉదయం 11 గంటలకు పట్టణంలోని తులసీ గార్డెన్లో జరిగే సమావేశానికి హిందూ బందువులందరు హాజరుకాగలరని విజ్ఞప్తి చేశారు.


