
సీజ్ చేసిన మద్యం ధ్వంసం
– నాటుసార, నల్లబెల్లం, బీర్ల నిర్వీర్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత పార్లమెంట్ ఎన్నికల్లో సీజ్ చేసిన మద్యంను తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా, నల్లబెల్లం, బీర్లును నిర్వీర్యం చేశారు. జనవరీ 09వ తేది నుంచి మే 7వ తేది వరకు పట్టుపడ్డ మద్యాన్ని ఏఈఎస్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 188కిలోల నల్లబెల్లం, 96 లీటర్ల నాటుసార, 7లీటర్ల బీర్లు, 49 లీటర్ల ఐఎంఎల్ మధ్యాన్ని నిర్వీర్యం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎక్సైజ్ సీఐ గంగాధర్, ఎస్ఐలు, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

