పసికందు మృతిపై విచారణ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పసికందు మృతిపై విచారణ..!
– ఎంసీహెచ్‌లో డీసీహెచ్ఎస్ తనిఖీ
– వైద్యురాలుకు మెమో జారీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో మృతి చెందిన పసికందు సంఘటనపై వైద్య విధాన పరిషత్ సమన్వయ కర్త(డీసీహెచ్ఎస్) డా. ప్రదీప్ విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో విధుల్లో ఉన్న వైద్యురాలు మెమో జారీ చేసినట్లు తెలిసింది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం రేగడి మైలారంకు చెందిన శివకుమార్ భార్య కవిత ఆదివారం ప్రసవం కోసం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు.

ఉదయం ఆసుపత్రిలో చేరితే రాత్రి జరిగిన ప్రసవంలో మగ బిడ్డ జన్మినిచ్చింది. కాని కొద్ది సేపటికే పసికందు మృతి చెందిన సంఘటన తెలిసిందే. తన భార్య ప్రసవం విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేశారని కవిత భర్త శివకుమార్ ఆరోపించారు. సోమవారం సంఘటన వెలుగులోకి రావడంతో మంగళవారం డీసీహెచ్ఎస్ డా.ప్రదీప్ మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ఆసుప్రతి సూపరిండెంట్ డా.మూర్తి, ఎంసీహెచ్ ఆర్ఎంఓ డా.అనిల్ తో కలిసి ప్రసవ సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలు డా.మంజులతో కలిసి విచారణ చేపట్టారు.

ప్రసవం తరువాత పసికందు బాగానే ఉందని, అయితే శ్వాసకోశ సమస్యలతోనే మృతి చెందినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని డీసీహెచ్ఎస్ మెమో జారీ చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం డీసీహెచ్ఎస్ డా.ప్రదీప్ మాట్లాడుతూ పసికందు మృతి ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేనట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

మళ్లీ ఫ్లైఓవర్ వివాదం..!