మాజీ సర్పంచుల అరెస్టు..!
– పోలీస్టేషన్లో నిర్బంధం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మాజీ సర్పంచులు అరెస్టు అయ్యారు. పోలీసులు మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ నిర్బంధాలు చేశారు. తమ హాయాంలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ మాజీ సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టి.. ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మాజీ సర్పంచులు ఆందోళనకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ లో గౌతాపూర్ మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, మిట్టబాస్పల్లి మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, బెల్కటూర్ మాజీ సర్పంచ్ మధు, సంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, కరణ్ కోట్ మాజీ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ తదితర గ్రామాల మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అదుపులో ఉన్న మాజీ సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు చేసిన ఉద్యమాలను ఆపలేరని అన్నారు.
ఇదికూడా చదవండి…

