బోనమ్మను దర్శించుకున్న నల్గొండ అడిషనల్ ఎస్పీ
– అమ్మవారికి మధుసూదనన్ రావు పూజలు
– దర్శించుకున్న బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలసిన బోనమ్మ తల్లిని నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు దర్శించుకున్నారు. ఆదివారం జరిగిన జాతర ఉత్సవాల సందర్భంగా అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఉన్న బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, నాయకులు సిరిగిరిపేట్ రాజు, హరిగౌడ్, రాము ముదిరాజ్, గిరిజాపూర్ రమేష్, రాంరెడ్డిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు నారా అశోక్, నారా శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

