దసరా సెలవులు ఖరారు..!
– స్కూళ్లకు, కాలేజీలకు వేర్వేరుగా
– ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలగాణ రాష్ట్రంలో దసరా సెలువులు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో దసరా సెలవులను ప్రకటించింది. స్కూళ్లకు ఓ విధంగా, కాలేజీలకు మరో విధంగా సెలవు తెదీలను ఇచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇదికూడా చదవండి…

