కౌన్సిలర్ పై దాడి ఘటనలో ట్విస్ట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కౌన్సిలర్ పై దాడి ఘటనలో ట్విస్ట్..!
– వరకట్నం కోసం వేధింపులు
– ఆరోపించిన ఈర్షాద్ భార్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ పై దాడి ఘటనలో ట్విస్ట్ ఏర్పడింది. ఈర్షాద్ పై ఆయన భార్య కీలక ఆరోపణలు చేశారు. శుక్రవారం రాత్రి ఈర్షాద్ పై ఆయన బామ్మర్ది మిత్రులతో కలిసి దాడి చేసినట్లు కుటుంబీకులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈర్షాద్ భార్య ఖండించారు. ఈర్షాద్ తనను వరకట్నం కోసం వేధించే వారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి కూడా దాడి చేశారని తెలిపారు. దీంతో సోదరుడికి ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చారని. సోదరుడు రావడంతో తప్పించు కొన్నట్లు వివరించారు. ఈర్షాద్ వల్ల నరకం అనుభవించినట్లు తెలిపారు.

కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..!