వేణుగోపాల్ రెడ్డిని సన్మానించిన మిత్ర బృందం
– స్నేహితుల మద్య జన్మదిన వేడుకలు
– శంకర్ యాదవ్ నివాసంలో శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం గోశాల అధ్యక్షులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన మిత్ర బృందం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో స్నేహితులు వేణుగోపాల్ రెడ్డిని సన్మానించారు. శాలువాతో సత్కరించి.. కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జుంటుపల్లి అరవింద్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యాయులు జొన్నల వినోద్ కుమార్, స్పైస్ మనోహర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్, భావనోళ్ల కిరణ్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు మధుసూదన్ రెడ్డి, బిట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

