గుట్కా స్థావరంపై దాడి
– రూ. 7.5లక్షల ప్యాకెట్ల స్వాదీనం
– నిందితులపై కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా సాగిస్తున్న గుట్కా స్థావరంపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆదేశాలతో తాండూరు పట్టణంలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. దాడులు నిర్వహించి రూ. 7.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నవాబ్ పేట్లో నవాబ్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం రవాణపై దాడులు నిర్వహించి 14.4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి…

