గోల్కొండ పైన కాషాయపు జెండా ఎగురేస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గోల్కొండ పైన కాషాయపు జెండా ఎగురేస్తాం..!
– రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు కలిసిన తాండూరు నాయకులు
– సన్మానించిన యు రమేశ్ కుమార్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గోల్కొండపై కాషాయపు జెండాను ఎగురవేస్తామని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన రాంచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

తార్నాక లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్‌తో పాటు శాంతకుమార్, కృష్ణ ముదిరాజ్, అంతారం లలిత, బంటారాం భద్రశ్వర్, నాగారం మల్లేశం, వీరేశం, జగన్ ముదిరాజ్, దోమ కృష్ణ, మల్లికార్జున్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో గోల్కొండపై కాషాయా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

అదనపు కట్నం వేధించిన భర్త..!