జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసిన స్వప్న పరిమళ్
– అక్రమాలు, సమస్యలపై ఫిర్యాదు చేసిన మాజీ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా నూతన ఎస్పీ స్నేహ మెహ్రాలను తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కలిశారు.

శనివారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా శనివారం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన స్నేహ మెహ్రను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

బాలికల అక్రమ రవాణా, మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు వంటి దుశ్చర్యలపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు రాజకీయాలపై చర్చించుకున్నారు.

ఇదికూడా చదవండి…

